రూ.1.61 లక్షల కోట్లకు చేరిన దిగుమతుల బిల్లు.. వంటనూనె ధరలూ పెరిగిపోతే..

ధరలు ఎందుకు పెరుగుతాయంటే? ప్రపంచ మార్కెట్‌లో పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు పెరిగితే భారత మార్కెట్‌లో కూడా ఒత్తిడి పెరుగుతుంది.

రూ.1.61 లక్షల కోట్లకు చేరిన దిగుమతుల బిల్లు.. వంటనూనె ధరలూ పెరిగిపోతే..

Edible oil

Updated On : November 15, 2025 / 12:50 PM IST

Edible oil: అంతర్జాతీయంగా వంటనూనె ధరలు అధికంగా ఉండటంతో 2024-25 ఆయిల్‌ ఇయర్‌ (నవంబర్‌-అక్టోబర్‌)లో భారత్‌ దిగుమతి చేసుకున్న పామ్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెల విలువ ఏడాదికి 22 శాతం పెరిగి, రికార్డు స్థాయిలో రూ.1.61 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో దిగుమతి పరిమాణం స్వల్పంగా మాత్రమే పెరిగి 16.01 మిలియన్‌ టన్నులకు చేరినట్లు పరిశ్రమ డేటా తెలిపింది.

“దిగుమతి చేసుకున్న నూనెల పరిమాణం 2023-24 ఆయిల్‌ ఇయర్‌తో పోల్చితే పెద్దగా మారలేదు. కానీ, గ్లోబల్‌ ధరలు అదే కాలంలో 2 శాతం పైగా పెరిగాయి” అని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (SEA) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.వి.మేహతా తెలిపారు. (Edible oil)

Also Read: పసిడి కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ధరలు భారీగా తగ్గాయ్‌.. ఇప్పుడే పరిగెత్తుకెళ్లి కొంటే..

భారత్‌ 2023-24 ఆయిల్‌ ఇయర్‌లో పామ్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ క్రూడ్‌‌, రిఫైన్డ్‌ నూనెలు 15.96 మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకోగా వాటి విలువ రూ.1.32 లక్షల కోట్లుగా నమోదైంది.

ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. 2024-25 ఆయిల్‌ ఇయర్‌లో సోయాబీన్‌ నూనె దిగుమతులు 5.47 మెట్రిక్‌టన్నులకు చేరి రికార్డు స్థాయిని తాకాయి. అంతకుముందు, 2015-16లో నమోదైన 4.23 మెట్రిక్‌ టన్నుల దిగుమతులే అత్యధికం.

గత ఆయిల్‌ ఇయర్‌లో పామ్‌ ఆయిల్‌ దిగుమతులు 9.02 మెట్రిక్‌ టన్నుల నుంచి 7.58 మెట్రిక్‌ టన్నులకు తగ్గాయి. సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌, ఇతర సాఫ్ట్‌ ఆయిల్స్‌ దిగుమతులు 6.95 మెట్రిక్‌ టన్నుల నుంచి 8.43 మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి. దీనికి అధిక సోయాబీన్‌ ఆయిల్‌ కొనుగోళ్లు కారణం.

“పామ్‌ ఆయిల్‌ వాటా 56 శాతం నుంచి 47 శాతానికి తగ్గగా, సాఫ్ట్‌ ఆయిల్స్‌ వాటా 44 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది” అని ఎస్‌ఈఏ వివరించింది.

జీరో డ్యూటీ ట్రేడ్‌ ఒప్పందం కింద దేశం నేపాల్‌ నుంచి 0.75 మెట్రిక్‌ టన్నుల రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలను భారత్ దిగుమతి చేసుకుంది.

భారత్‌ తన వంటనూనె అవసరాల్లో సుమారు 57 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. దేశీయ సరఫరా నిలకడగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా కేంద్రం వంటనూనెల దిగుమతి డ్యూటీలను మారుస్తూ వస్తోంది.

మే 30న కేంద్రం పామ్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ, సెస్ కలిపిన సమష్ఠి డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది.

ఇండొనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా దేశాల నుంచి భారత్‌ నూనెలు దిగుమతి చేస్తుంది. దేశంలో మస్టర్డ్‌, సోయాబీన్‌, గ్రౌండ్నట్‌ నూనెలు ఉత్పత్తి అవుతాయి.

ఫుడ్‌ మంత్రిత్వ శాఖ తాజాగా “వెజిటేబుల్‌ ఆయిల్‌ ప్రోడక్ట్స్‌ ప్రొడక్షన్‌ అండ్‌ అవైలబిలిటీ రెగ్యులేషన్‌ ఆర్డర్‌ 2025 (VOPPA)”ను నోటిఫై చేసింది. ఇది పారదర్శకత పెంచడం, సరఫరా అంతరాయాన్ని నివారించడం, వినియోగదారులకు సరైన ధరలు అందించడానికి లక్ష్యంగా ఉంచిన ఆర్డర్‌. వీవోపీపీఏ అంటే వంటనూనెల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాల వివరాలను ప్రభుత్వానికి తప్పనిసరిగా నివేదించే విధానం.

ఈ ఆర్డర్‌ ప్రకారం ప్రతి నెల 15వ తేదీలోపు ఆయిల్‌ వినియోగం, ఉత్పత్తి, విక్రయాలు, స్టాకులపై నివేదిక సమర్పించాలి. దీని ద్వారా సరఫరా గొలుసు పర్యవేక్షణ బలపడుతుంది. కాగా, జీరో డ్యూటీ ట్రేడ్‌ ఒప్పందం కింద దేశం నేపాల్‌ నుంచి 0.75 మెట్రిక్‌టన్నుల రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలను దిగుమతి చేసుకుంది.

ధరలు ఎందుకు పెరుగుతాయి?
వంటనూనెల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రపంచ మార్కెట్‌లో పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు పెరిగితే భారత మార్కెట్‌లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. భారత్ వంట నూనెలలో సుమారు 57 శాతం దిగుమతి తీసుకుంటుంది. దిగుమతి ఖర్చు పెరిగితే దేశీయ ధరలు కూడా పెరుగుతాయి. దిగుమతుల్లో అంతరాయం జరిగితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉంది. మస్టర్డ్, గ్రౌండ్‌నట్, సోయా వంటి స్థానిక నూనెల ఉత్పత్తి సరిపోవడం లేదు.