Gold Rate: ఇజ్రాయెల్ దెబ్బకు మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లు ఇలా..

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ మంచి సాధనం. అయితే, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.

Gold Rate: ఇజ్రాయెల్ దెబ్బకు మళ్లీ రూ.లక్ష దాటిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లు ఇలా..

Gold

Updated On : June 13, 2025 / 12:47 PM IST

Gold Rate: పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ మంచి సాధనం. అయితే, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు అమాంతం పెరుగుతోంది.. ఈ క్రమంలో మళ్లీ 10గ్రాముల 24క్యారట్ల బంగారం రేటు రూ. లక్ష దాటేసింది.

 

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,120 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,950 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో 10గ్రాముల గోల్డ్ పై సుమారు రూ. 4వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ 48 డాలర్లు పెరిగి.. శుక్రవారం ఉదయం 3,427 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 1100 పెరిగింది.

Also Read: బంగారం రూ.3 లక్షలు.. ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే..!

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతోపాటు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కూడా కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సేఫ్ అయిన గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు.. యూఎస్ ఇన్ ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే బలహీనంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించదనే అంచనాలు ఎక్కువయ్యాయి. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం భారీగా ధర పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,950కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,400 చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,550కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,01,400కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.