Lionel Messi : వర్చువల్గా 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మెస్సీ..
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi ) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు.
Lionel Messi Unveils 70 Feet Statue In Kolkata
Lionel Messi : ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన కోల్కతాకు చేరుకున్నారు. మెస్సీతో (Lionel Messi)పాటు అతడి ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ సైతం భారత్కు వచ్చారు.
ఈ ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి వచ్చారు. మెస్సీ మెస్సీ నామస్మరణతో అతడికి ఘన స్వాగతం పలికారు.
THE CRAZE IN KOLKATA TO SEE MESSI AT 2 AM….!!!! 🤯
– The Greatest, Leo. pic.twitter.com/jLsXoIIuMm
— Johns. (@CricCrazyJohns) December 13, 2025
విమానాశ్రయం నుంచి నేరుగా ఓ ఫైవ్స్టార్ ఓహోటల్కు మెస్సీ చేరుకున్నారు. ఆ తరువాత ఉదయం బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్తో కలిసి లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. భద్రతాకారణాల రీత్యా మెస్సీ విగ్రహాం వద్దకు వెళ్లలేదు.
VIDEO | Kolkata: Football icon Lionel Messi to virtually unveil his 70-foot statue from Salt Lake stadium, with West Bengal Minister Sujit Bose and Bollywood actor Shah Rukh Khan present at the event.#LionelMessi #Kolkata #Football
(Full VIDEO available on PTI Videos –… pic.twitter.com/dqISIwMgl4
— Press Trust of India (@PTI_News) December 13, 2025
వివిధ కార్యక్రమాలు ముగియగానే.. శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు మెస్సీ చేరుకోనున్నాడు. ముందుగా ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొనున్నాడు. ఈ మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆడనున్నారు.
