Gold Rate Today: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold
Gold Rate Today: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి జోరందుకోనుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏదైనా బంగారం కొనుగోళ్లు తప్పనిసరి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం కొనుగోలు మధ్య తరగతి ప్రజలకు భారీగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తద్వారా గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
ముఖ్యంగా అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొంటున్న వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై ఏకంగా 250శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి నష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ బదులుగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు ఎక్కువగా మళ్లిస్తుండటంతో గోల్డ్ రేటు అమాంతం పెరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10గ్రాముల) ధర శుక్రవారం ఉదయం 3,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక భారతదేశంలో శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 270 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 250 పెరిగింది. అయితే, నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లభించినట్లే.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,580కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,730కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,580 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,900 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,900గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,900కు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.