Gold Rate: ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..

Gold Rate: ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణాలు ఇవే..

Gold

Updated On : July 21, 2025 / 11:56 AM IST

Gold Rate: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి షాకింగ్ న్యూస్. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. రోజురోజుకు గోల్డ్ రేటు పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో భారత దేశంలో బంగారం, వెండిని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.110 పెరగ్గా.. 22 క్యారెట్ల గోల్డ్ పై రూ.100 పెరిగింది. దీంతో గడిచిన గడిచన ఐదు రోజుల్లో తులం బంగారంపై సుమారు రూ.900 పెరిగింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారం 16 డాలర్లు పెరిగి.. ప్రస్తుతం 3,367 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,800కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,150కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,850కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,190 కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.91,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,00,30కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000కు చేరుకుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,00కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.