Gold Price Today : హమ్మయ్య..! బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారంపై ఎంత తగ్గిందో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold
Gold And Silver Prices Today : వరుసగా మూడేళ్లు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతీయేటా బంగారం ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2023లోనూ బంగారం ధర భారీగానే పెరిగింది. 2024లోనూ గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? మార్కెట్ ట్రెండ్ బట్టి బంగారాన్ని కొనాలా? వద్దా అనేది కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే.. అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.
బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ గోల్డ్ ధరలు కాస్త తగ్గాయి. 2024లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో కొత్త ఏడాదిలో తొలిసారి బంగారం ధల్లో తగ్గుముఖం కనిపించింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250 తగ్గింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 270 తగ్గింది. అదేవిధంగా వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,500కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ.63,820 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,970.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,150కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,530గా నమోదైంది.
తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గురువారం వెండి ధర తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,600కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,500 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.