Laptops Price in India : పీసీల దిగుమతులపై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ల్యాప్టాప్ల ధరలు..!
Laptops Price in India : దేశీయ తయారీని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పీసీల దిగుమతిపై ఆంక్షలు విధించింది. ఫలితంగా దేశంలో ల్యాప్టాప్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Laptops in India to get more expensive as govt mandates import licence_ Story in 5 points
Laptops Price in India : భారత ప్రభుత్వం HSN కోడ్ 8741 కింద ఉత్పత్తుల దిగుమతులను పరిమితం చేసింది. ఇందులో ప్రధానంగా ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పీసీలు, అల్ట్రా-స్మాల్ కంప్యూటర్లు ఉంటాయి. ఈ నిర్ణయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
చైనాలో తయారైన Apple, Dell, HP, Lenovo వంటి దిగుమతి డివైజ్లతో సహా ప్రధాన OEMలుగా భారత మార్కెట్లో పీసీల తయారీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. అప్పటివరకూ కంపెనీలు దిగుమతి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో పీసీలు, టాబ్లెట్లు, ల్యాప్టాప్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ, పీసీ దిగుమతులపై ప్రభుత్వం విధించిన పరిమితికి సంబంధించి కీలకమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
ఆగస్టు 3న లాంచ్ చేసిన ప్రభుత్వ నోటీసులో.. ‘ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా-స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిని HSN 8741 కింద పరిమితం చేయాలి. పరిమితం చేసిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్కు వ్యతిరేకంగా అనుమతించనుంది. తక్షణ ప్రభావంతో చర్యలు అమలులో ఉన్నాయి. ఆన్లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసే యూజర్లకు మినహాయింపులు ఉన్నాయి.
అయినప్పటికీ కంపెనీలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, బెంచ్మార్కింగ్, మరమ్మత్తులు, ఎగుమతుల కోసం పీసీల దిగుమతి వంటిలైసెన్సింగ్పై మినహాయింపులు ఉన్నాయి. ఈ చర్యతో నేరుగా భారత మార్కెట్లో దేశీయ ఉత్పత్తుల తయారీ పెరిగనుంది. ఐటీ హార్డ్వేర్కు ప్రొడక్టు ఆధారిత ప్రోత్సాహకాలు (PLI) కోసం కేంద్రం కూడా ఒత్తిడి చేస్తోంది.
ఈ పథకం రూ. 17వేల కోట్లతో మేలో ముందుగా సవరించగా.. 2021లో తొలిసారిగా క్లియర్ చేసిన బడ్జెట్ కన్నా రెండింతలుగా ఉంది. 2020లో ప్రభుత్వం కలర్ టీవీల దిగుమతిపై విధించిన పరిమితుల మాదిరిగా పీసీ దిగుమతులపై నియంత్రణ అమలు చేస్తోంది. రెండేళ్ల తర్వాత భారత్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల్లో ఒకటైన Viera గ్రూప్.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో స్థానిక టీవీ తయారీని పెంచాయని నివేదిక తెలిపింది. తాజా చర్యతో ఇటీవల భారత మార్కెట్లో జియోబుక్ను ప్రారంభించిన రిలయన్స్ వంటి కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

Laptops in India to get more expensive as govt mandates import licence
ఈ కంపెనీలు చైనా నుంచి తమ ల్యాప్టాప్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక కంపెనీలు దిగుమతి మినహాయింపు లైసెన్స్ను పొందడం సులభతరం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ నోటీసు తర్వాత భారతీయ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు కూడా గురువారం నాటి ట్రేడింగ్లో 6 శాతం పెరిగాయి.
అదే సమయంలో, PC OEMలు రాబోయే కొన్ని త్రైమాసికాలలో భారీ దెబ్బకు తగలనుంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) డేటా ప్రకారం.. భారత సాంప్రదాయ PC మార్కెట్ (డెస్క్టాప్లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లతో సహా) 1Q23 (జనవరి-మార్చి)లో 30.1 శాతం క్షీణించింది.
కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. ‘మొత్తం ల్యాప్టాప్/పిసి మార్కెట్ పరిమాణం సంవత్సరానికి 8 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండటం, దాదాపు 65 శాతం యూనిట్లు దిగుమతి కావడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. దేశీయ పరిశ్రమలో సుమారు 12 మిలియన్ యూనిట్లను కలిగి ఉంది. ఈ పరిమితితో ముఖ్యంగా Apple, HP, Lenovo వంటి బ్రాండ్లకు కొన్ని స్వల్పకాలిక సరఫరా అంతరాయాలకు దారితీయవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.