PM Kisan : బిగ్ అలర్ట్.. ఇలా చేస్తేనే పీఎం కిసాన్ రూ. 2వేలు.. ఇంట్లో నుంచే e-KYC పూర్తి చేయొచ్చు.. స్టేటస్ చెకింగ్ ఎలాగంటే?

PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. లేదంటే.. బ్యాంకు ఖాతాలో 20వ విడత రూ. 2వేలు పడవు.

PM Kisan : బిగ్ అలర్ట్.. ఇలా చేస్తేనే పీఎం కిసాన్ రూ. 2వేలు.. ఇంట్లో నుంచే e-KYC పూర్తి చేయొచ్చు.. స్టేటస్ చెకింగ్ ఎలాగంటే?

PM Kisan Yojana

Updated On : June 13, 2025 / 6:24 PM IST

PM Kisan 20th instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం (PM Kisan) అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు ఇస్తోంది. రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని అందుకుంటారు. ప్రతి విడతలో రైతులు రూ. 2వేలు బ్యాంకు అకౌంటులో జమ అవుతుంది.

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల కానుందో ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కొన్ని నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల జూన్ 20న విడుదల అయ్యే అవకాశం ఉంది. e-KYC పూర్తి చేసిన రైతుల ఖాతాలో మాత్రమే రూ. 2వేలు పడతాయి. మీరు ఇంకా కేవైసీ పూర్తి చేయకపోతే.. ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Motorola Edge 50 : ఆఫర్ అదిరింది గురూ.. రూ.28వేల మోటోరోలా ఫోన్ కేవలం రూ. 15వేలకే.. ఇప్పుడే కొనడం బెటర్..!

పీఎం-కిసాన్ పథకం ఏంటి? :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది భారత ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. దేశవ్యాప్తంగా అర్హతగల భూమి కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 3 విడతలుగా విడుదల చేస్తారు.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు అకౌంటులో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం కింద ప్రయోజనాలను ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది.

20వ విడత తేదీ ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 20వ విడత జూన్ 20, 2025న విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. 19వ విడత గత ఫిబ్రవరిలో విడుదలైంది.

ఎవరు అర్హులు? :

  • 20వ విడత కోసం రైతులు తప్పనిసరిగా ఈ అర్హతలు కలిగి ఉండాలి.
  • భారతీయ పౌరులు
  • సొంత సాగు భూమి
  • బ్యాంకు అకౌంట్‌తో ఆధార్‌ లింక్
  • eKYC వెరిఫికేషన్
  • ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు అనర్హులు.

eKYC ఎలా పూర్తి చేయాలంటే? :
పీఎం కిసాన్ యోజనకు eKYC చాలా ముఖ్యం. కేవైసీ కోసం రైతులు మొబైల్ యాప్, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ పూర్తి చేసేందుకు ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.

  • ఆధార్ కార్డ్
  • ల్యాండ్ వెరిఫికేషన్
  • బ్యాంక్ అకౌంట్
  • ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా లింక్
  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) విజిట్ చేయాలి.
  • హోం పేజీలో ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేసి e-KYC ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను యాడ్ చేయాలి.
  • మీ మొబైల్‌లో OTP పాస్‌వర్డ్ వస్తుంది.
  • ఎంటర్ చేశాక మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

బ్యాంక్ అకౌంటుతో ఆధార్ లింక్ చేయండి : (PM Kisan)

  • అర్హతల గల రైతులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా వాయిదాను పొందవచ్చు.
  • లబ్ధిదారుల ఆధార్ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేసి ఉండాలి.
  • బ్యాంకు హోం బ్రాంచ్‌‌కు వెళ్లండి.
  • ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ సర్వీసు ఎంచుకోండి.
  • మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లింక్ చేయొచ్చు.

Read Also : Lava Storm Series : లావా 2 కొత్త బడ్జెట్ 5G ఫోన్లు.. ధర రూ. 8వేల లోపే.. చైనా ఫోన్ల కన్నా బెటర్ ఫీచర్లు.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

లబ్ధిదారుని స్టేటస్ ఇలా చెక్ చేయండి :

  • అధికారిక (pmkisan.gov.in) వెబ్‌సైట్ విజిట్ చేయండి.
  • ‘Farmer Corner’ కింద “Beneficiary Status”పై క్లిక్ చేయండి.
  • ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • 20వ వాయిదా పేమెంట్ హిస్టరీ, అర్హతను చెక్ చేయండి.