PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు.. ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి.. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు!

PM Kisan Yojana 19th installment : పీఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాదిలో రూ. 6వేలు వస్తాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో ఇస్తారు. లబ్ధిదారుల జాబితాలో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు.

PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు.. ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి.. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు!

PM Kisan Yojana 19th installment

Updated On : February 18, 2025 / 7:08 PM IST

PM Kisan Yojana 19th installment : ప్రధానమంత్రి కిసాన్ 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది భారత ప్రభుత్వ పథకం. చిన్న భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. రైతుల వ్యవసాయ ఆర్థిక అవసరాలను తీర్చడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 24, 2024న విడుదల కానుంది.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సిస్టమ్ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను బదిలీ అవుతుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో రూ. 2వేలు పొందవచ్చు.

Read Also : 8th Pay Commission Update : బిగ్ అలర్ట్.. ఈసారి 2 విడతల్లో డీఏ విడుదల..? భారీగా పెరగనున్న పెన్షర్లు, ఉద్యోగుల జీతాలు..!

లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)లోని పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేమెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు. ఆ జాబితాలో తమ పేరును ధృవీకరించవచ్చు. అయితే, పేమెంట్ స్వీకరించాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి.

పీఎం కిసాన్ 19వ వాయిదా తేదీ, ఇతర వివరాలివే :
వాయిదా మొత్తం : రూ. 2వేలు
మొత్తం వార్షిక సాయం : రూ. 6వేలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2025
ట్రాన్స్‌ఫర్ మోడ్ : డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)

ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద భారత ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6వేలు ఇస్తుంది. ఈ డబ్బును 3 విడతలుగా నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది. ఒక్కో విడతలో రూ. 2వేలు చొప్పున విడుదల ఇస్తారు. ఈ పథకానికి భారత ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఎలా చెక్ చేయాలి? :

రైతులు పేమెంట్ స్టేటస్ గురించి ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.
ముందుగా అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ (pmkisan.gov.in)కి వెళ్లండి.
ఆ తరువాత ‘Beneficiary Status’ పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
ఆ తరువాత, మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేయడానికి ‘Get Data’పై క్లిక్ చేయండి.
ఏ రైతు పేరు మిస్ అయినా హెల్ప్ కోసం లోకల్ అధికారులను సంప్రదించాలి.

వాయిదా పొందాలంటే e-KYC తప్పనిసరి :

పీఎం కిసాన్ లబ్ధిదారులకు డబ్బులు చేరేందుకు, మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం (e-KYC) తప్పనిసరి చేసింది. రైతులు 3 పద్ధతులను ఉపయోగించి (e-KYC) పూర్తి చేయవచ్చు.
OTP-ఆధారిత e-KYC (ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ద్వారా)
ఫేస్ అథెంటికేషన్ ఆధారిత e-KYC విధానం
బయోమెట్రిక్ ఆధారిత e-KYC (కామన్ సర్వీస్ సెంటర్లలో)

పీఎం కిసాన్ పథకం 2019 వివరాలివే :

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) కార్యక్రమాలలో ఒకటి. 2019లో ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి భారత్ అంతటా లక్షలాది మంది రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతుగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందారు.

Read Also : Credit Card Cash : క్రెడిట్ కార్డ్‌‌తో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. లేదంటే అప్పుల పాలవుతారు..!

రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసి, అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పీఎం కిసాన్ 19వ విడతను విడుదల చేయనున్నారు.