SBI కస్టమర్లకు ఝులక్ : డిసెంబర్ 31 తర్వాత కార్డులు చెల్లవు!

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 04:01 AM IST
SBI కస్టమర్లకు ఝులక్ : డిసెంబర్ 31 తర్వాత కార్డులు చెల్లవు!

Updated On : December 4, 2019 / 4:01 AM IST

కస్టమర్లకు SBI ఝులక్ ఇచ్చింది. డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచేయవని వెల్లడించింది. వెంటనే ఈవీఎం చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత కార్డులతో రీ ప్లేస్ చేయడం జరిగిందని కస్టమర్లకు ఎస్‌బీఐ తెలిపింది. మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి అప్లై
చేసుకోవాలని ట్వీట్ చేసింది.

Read More : అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఎయిర్ టెల్, ఐడియా మొబైల్  చార్జీలు
సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తి చేయాలని, కస్టమర్లు ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈవీఎం చిప్ డెబిట్ కార్డును పొందచ్చని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లవచ్చని తెలిపింది. బ్యాంకు అకౌంట్ కరెంటు అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని, కొత్త ఈవీఎం చిప్ కార్డు బ్యాంకు అకౌంట్ ఉన్న అడ్రస్‌కు వెళ్లిపోతుందని..అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్ డేట్ చేసుకోవాలని సిబ్బంది సూచించారు. 
Apply now to change your Magnetic Stripe Debit Cards to the more secure EMV Chip and PIN based SBI Debit card at your home branch by 31st December, 2019. Safeguard yourself with guaranteed authenticity, greater security for online payments and added security against fraud. pic.twitter.com/t9K3TiGTad