7 వేల కోట్ల పెట్టుబడులపై కుదిరిన ఒప్పందం.. ఓలా, స్టాలిన్ ప్రభుత్వం సంతకాలు

ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కొత్త విధానాన్ని లాంఛనంగా విడుదల చేశారు.

TN govt signs MoU with Ola Electric Mobility to make EVs

MoU btw Ola and TN Govt: శనివారం చెన్నై సచివాలయంలో తమిళనాడు ప్రభుత్వం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకం చేశాయి. ఓలా సంస్థ తన ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి MoU btw Ola and TN Govt: రాష్ట్రంలో 20 జీడబ్ల్యూ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై ప్రభుత్వంతో కొద్ది రోజుల క్రితమే ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరు వర్గాల మధ్య నేడు ఎంఓయూ కుదిరింది.

Drugs-Weapons : పంజాబ్ గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం

7,614 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓలా ఏర్పాటు చేస్తున్న ఈ బ్యాటరీ తయారీ కేంద్రం ద్వారా 3,111 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే కోయంబత్తూరులో రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక చెన్నైలోని గాంధీపురంలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీకి ప్రస్తుతం నగరంలో రెండు ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇటువంటి 200 అనుభవ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మార్చి 2023 నాటికి సంస్థ తన నెట్‌వర్క్‌ను 500 అవుట్‌లెట్‌లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

Contact Lenses : కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండానే నిద్రపోటంతో కన్నునే పోగొట్టుకున్న యువకుడు

అన్ని సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఓలా అనుభవ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని సేకరించేందుకు ఓలా ఔత్సాహికులకు అనుమతి ఉంటుంది. ఇక ఎస్1, ఎస్ S1 ప్రో టెస్ట్ రైడ్‌లను పొందేందుకు, ఓలా బ్రాండ్ ఛాంపియన్‌ల నుంచి కొనుగోలు చేయడంలో సహాయం పొందేందుకు, ఫైనాన్సింగ్ ఎంపికలపై వివరాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.

Nikki Yadav Murder: నిక్కీ యాదవ్ హత్య కేసులో ట్విస్ట్.. రెండేళ్లక్రితమే పెళ్లి చేసుకున్న జంట

ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కొత్త విధానాన్ని లాంఛనంగా విడుదల చేశారు.