హైదరాబాద్ – విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఉప్పల్‌లోనూ విషాదం..

వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

హైదరాబాద్ – విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఉప్పల్‌లోనూ విషాదం..

Road Accidents: సూర్యాపేట జిల్లా మునగాల వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఇంట్లోకి దూసుకెళ్లింది. గేదెలు అడ్డు రావడంతో వాటిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

చికెన్ సెంటర్ లోకి దూసుకెళ్లిన కారు
నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకున్న మరో ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపుతప్పి చికెన్ సెంటర్ లోకి దూసుకెళ్లి కరెంట్ పోల్ ని బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: బర్త్‌డే కేక్ తిని బాలిక మృతి కేసు.. పాప మరణానికి అసలు కారణం ఏంటో తెలిసి అంతా షాక్..!

నిస్సహాయ స్థితిలో కాలిపోయి..
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నవాబుపేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య పెట్రోల్ కొని బైకుపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బైకుకు మంటలు అంటుకుని సజీవ దహనమయ్యాడు. హైవేపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని గమనించినా.. నిస్సహాయ స్థితిలో వెంకయ్య మంటల్లో కాలిపోయాడు. పెనుగంచిప్రోలు పోలీసులు ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also Read: హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్

ఉప్పల్‌లో విషాదం..
యువకుడిపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటన విషాద ఘటన హైదరాబాద్ లోని మంగళవారం ఉదయం ఉప్పల్‌లో చోటుచేసుకుంది. వర్షిత్ రెడ్డి అనే యువకుడు బైక్ పై వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిపై నుంచి దూసుకుపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.