గుంటూరులో కాల్ మనీ : వడ్డీ వ్యాపారి అరెస్ట్ తో కలకలం

గుంటూరులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిపై కేసు నమోదు చేసి, నిఘా పెట్టారు.
తర్వాత ఆయన ఆఫీసులో తనిఖీలు చేపట్టి, బ్యాంకు పాస్బుక్కులు, ఏటీఎం కార్డులు, పొలం పాస్ బుక్కులు, ఖాళీ ప్రామీసరీ నోట్లతో పాటు కొన్ని దస్తావేజులు పోలీసులుస్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
రత్నారెడ్డి కేవలం ఉద్యోగస్తులను టార్గెట్ చేసుకుని వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని బాధితులు ఎవరైనా ఇంకా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. రత్నా రెడ్డి నుంచి లక్షా 40 వేల రూపాయల నగదు, 38 పాస్ బుక్కులు, వందకుపైగా ఖాళీ ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.