Delhi : వేరు కాపురం కోసం వేధింపులు, అంగీకరించని భర్త చెవి కొరికేసిన మహిళ

‘నా భార్య నా చెవి కొరికేసింది’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.

Delhi : వేరు కాపురం కోసం వేధింపులు, అంగీకరించని భర్త చెవి కొరికేసిన మహిళ

police complaint

man police complaint ON Wife: ‘నా భార్య నా చెవి కొరికేసింది’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. కానీ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్య తన కుడి చెవిని కొరికేసిందని..సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అంటూ ఢిల్లీలోని సుల్తాన్ పురిలో 45 వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నవంబర్ 20 ఉదయం తాను చెత్త పడేయడానికి బయటకు వెళుతు.. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేయాలని చెప్పి వెళ్లానని..తిరిగి వచ్చేసరికి ఇల్లంతా యధావిదిగా ఉందని దీంతో భార్యను ప్రశ్నించానని..దీంతో ఆమె తనతో గొడవకు దిగిందని తెలిపాడు. అంతేకాదు తాము నివసించే ఇంటిని సగం వాటా అమ్మేసి పిల్లలతో కలిసి వేరు కాపురం పెడతానని సతాయిస్తోందని వాపోయాడు. ఇల్లు అమ్మేందుకు తాను అంగీకరించకపోవటంతో గొడవ పెద్దది చేసిందని..ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడిందని దాంతో తనకు కోపం ఎక్కువై ఆమెను పక్కకు నెట్టి బయటకు వెళ్లిపోతుండగా ఆమె తనను వెనక్కి లాగి తన కుడిచెవి కొరికేసింది అని పోలీసులకు తెలిపాడు.

Cheating : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

చెవి బాగా ఛిద్రమైపోయిందని దీంతో తన కుమారుడు తనను బంగోల్ పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఫిర్యాదులో వెల్లడించాడు. కానీ అక్కడి డాక్టర్లు తనను జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవాలని సూచించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతు..సదరు బాధితుడు చికిత్స చేయించుకున్న తరువాత నవంబర్ 22న తమకు ఫిర్యాదు చేశాడని తాము..అతని భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.