ట్రంప్ ఆదేశాలతో…ఇరాన్ గార్డ్స్ కమాండర్ ని హతమార్చిన యూఎస్ బలగాలు

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు తుదముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే సొలైమనిని హతమార్చినట్లు ఇవాళ పెంటగాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా సభ్యులపై దాడి చేసే ప్రణాళికలను సోలైమాని యాక్టివ్ గా డెవలప్ చేస్తున్నారని, వందలాది మంది అమెరికన్ మరియు సంకీర్ణ సేవా సభ్యుల మరణాలకు మరియు వేలాది మంది గాయపడటానికి సోలైమాని మరియు అతని కుడ్స్ ఫోర్స్ కారణమని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సోలైమాని మరణం తరువాత, ట్రంప్ అమెరికా జెండా యొక్క చిత్రాన్ని ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు.
శుక్రవారం ఉదయం బగ్దాద్ విమానాశ్రయ సమీపంలో కారులో వెళ్తున్న సొలేమనిపై అమెరికా దళాలు వైమానిక దాడి చేశాయి. ఈ జరిగిన దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేని తెలిపారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. సోలైమని పని, అతని మార్గం ఆపబడదని ప్రతిజ్ఞ చేశాడు. మూడు రోజుల పాటు సంతాప దినాలు కూడా ఆయన ప్రకటించారు.
ఇరాన్లో 62 ఏళ్ల జనరల్ సొలేమనీ ఇటీవల కీలక వ్యక్తిగా మారారు. సొలేమనీకి చెందిన దళాలు ఆ దేశాధినత అయతుల్లా అలీ ఖమనీకి నేరుగా రిపోర్ట్ చేసేవారు. ఇరాకీలో జనరల్ ఖాసిమ్ను ఓ హీరోగా కీర్తించేవారు. కానీ అమెరికా మాత్రం ఆయన్ను ఓ ఉగ్రవాదిగా చిత్రీకరించింది. ఇరాక్లో వేలాది మంది అమెరికన్ల చావుకు ఆయనే కారణమని ఆరోపిస్తున్నది. కుడ్స్ ఫోర్స్ కమాండర్గా జనరల్ సొలేమని గుర్తింపు పొందారు.