Chittoor : క్షుద్ర భయం కల్పించి బాలికపై మూడు నెలలుగా అత్యాచారం
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.
Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని డక్కిలి గ్రామానికి చెందిన శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) అనే వారు క్షుద్రపూజలు చేస్తూ ఉంటారు.
ఇద్దరికీ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలికపై కన్ను పడింది. దీంతో బాలికకు మంచి మాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. అనంతరం బాలిక మనసులో క్షుద్ర భయం కలిగించారు. మీ కుటుంబంలో పరిస్ధితులు అనుకూలంగా లేవని…. సమస్యలున్నట్లు బాలికకు చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే తల్లితండ్రులకు మరణం తప్పదని చెప్పారు.
ఇలా బాలికను భయపెడుతూ గడిచిన మూడు నెలలుగా లైంగిక దాడి చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల గత రెండు రోజులుగా తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడటం చూసిన బాలిక తల్లితండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం బయట పడింది.
దీంతో బాలికను గట్టిగా నిలదీసి అడగ్గా… శ్రీరాం సుబ్బయ్య భాస్కర్ చేస్తున్న బాగోతం బయటపెట్టింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుబ్బయ్య, భాస్కర్ లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Chennai : వెరైటీ దొంగ-బిర్యానీలో పెట్టుకుని బంగారం తినేశాడు