ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 09:10 AM IST
ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు

Updated On : October 28, 2019 / 9:10 AM IST

ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్-C లెవెల్ 2 టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. కోల్ కత్త, పశ్చిమ బెంగాల్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి  ఉంటుంది. అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: 
అభ్యర్ధులు పదో తరగతి, ఐటిఐ పాస్ కావాల్సి ఉంటుంది. 10వ తరగతితో ఐటిఐ చదువు ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.

వయసు:
అభ్యర్ధలు 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి.  

దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 1, 2019.

దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 1, 2019. 

Read Also: అప్లై చేసుకోండి: ఇండియన్ రైల్వేలో 2వేల 600 ఖాళీలు