Telangana DOST 2025 Final Phase Registration Deadline Extended
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు విడతలు ప్రెవేశాలు పూర్తవగా.. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం ఇటీవల స్పెషల్ ఫేజ్ ను ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూలై 31గా నిర్ణయించారు. కానీ, తాజాగా ఈ గడువు తేదీని మరోసారి పొడిగించారు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. పొడగించిన తేదీ ప్రకారం అభ్యర్థులు ఆగస్ట్ 2వ తేదీ అంటే రేపటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఫేస్ కి సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్ట్ 6వ తేదీన ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది, అలాగే స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందే వారికి స్కాలర్ షిప్స్ అవకాశం ఉండదు.