LB స్టేడియంలో మోడీ సభ..ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో
బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరానికి రానున్నారు. ఏప్రిల్ 01వ తేదీ సోమవారం ఈ సభ జరుగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
– పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్నగర్ జంక్షన్ వైపు మళ్లింపు.
– ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి..బిజెఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
– అబిడ్స్, గన్ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్బిఐ గన్ఫౌండ్రి నుంచి చాపేల్ రోడ్డులోకి అనుమతిస్తారు.
– రాజమొహల్లా నుంచి వచ్చే వాహనాలు కింగ్ కోఠి, నారాయణగూడ వైపుగా వెళ్లాలి.
– బషీర్బాగ్ జంక్షన్ నుంచి జిపిఓకు వచ్చే వాహనాలను హైదర్గూడ, కింగ్ కోఠి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
– ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.
– కింగ్ కోఠి నుంచి బషీర్బాగ్కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్ వద్ద కింగ్కోఠి క్రాసు రోడ్డు తాజ్ బంజారా హోటల్ వైపుగా మళ్లిస్తారు.
– అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్ణుంచి హిమాయత్నగర్ రోడ్ వైపు వెళ్లాలి.
– హిల్ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలు బషీర్బాగ్ వైపు వెళ్లవద్దు. పిసిఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి రోడ్డు గుండా