దేశంలోనే ఫస్ట్ టైమ్ : పిల్లల కోసం పోలీస్ స్టేషన్
చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్... పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ పిల్లలు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి

చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్… పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ పిల్లలు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి
చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్… పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ పిల్లలు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్లో గురువారం(నవంబర్ 14,2019) చైల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్ను ప్రారంభించనున్నారు. బచ్పన్ బచావో సంస్థ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఏడాది నుంచి 18 ఏళ్ల పిల్లలు.. వారికి ఎదురయ్యే బాధలు, ఈవ్టీజింగ్, ర్యాగింగ్ సమస్యలను ఈ పోలీస్స్టేషన్కు వచ్చి చెప్పుకోవచ్చు. కాలేజీ, స్కూళ్లలో సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని సీపీ భగవత్ తెలిపారు.
మేడిపల్లి పోలీస్స్టేషన్లో ప్రత్యేకంగా కేటాయించిన రూమ్కు చిల్డ్రన్స్ పోలీస్స్టేషన్గా పేరు పెట్టారు. ప్రత్యేక శిక్షణ పొందిన యూనిఫాంలో లేని పోలీసులు ఇక్కడ ఉంటారు. పోలీసులంటే భయం లేకుండా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్స్టేషన్కు వచ్చి పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలు, విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు మంచి వాతావరణంలో ప్రత్యేకంగా చూసుకుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు.
ఈ పోలీస్స్టేషన్లో ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు. అంతేకాదు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉంచారు. పచ్చదనం ఉన్న వాల్ పోస్టర్లు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు తదితర సౌకర్యాలు కల్పించారు. చాలామంది ఇక్కడున్న ఏర్పాట్లు, సౌకర్యాలు చూసి ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ ఏమో అనుకుంటున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇది మంచి పరిణామం అని అభినందిస్తున్నారు.