దసరా సెలవులు : విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కన్ ఫ్యూజన్
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దసరా సెలవుల పొడిగింపుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కన్ ఫ్యూజన్ నెలకొంది. సెలవులు పొడిగించామని ప్రభుత్వం చెబుతుంటే.. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మాత్రం.. సోమవారం(అక్టోబర్ 14, 2019) నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని విద్యార్థులకు మేసేజ్ పంపాయి. దీంతో పేరెంట్స్ అయోమయంలో పడ్డారు.
సెలవులు పొడిగించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించినా.. సోమవారం నుంచి యథాతథంగా క్లాసులు ప్రారంభమవుతాయని స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు చెప్పడం గందరగోళానికి దారితీసింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా క్లాసులు ప్రారంభిస్తామని యాజమాన్యాలు అనౌన్స్ చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 13వ తేదీతో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈసారి ఎప్పుడూ లేని విధంగా విద్యాసంస్థలకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ఓ పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె, మరోపక్క పండుగకు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు.