రేవంత్ రెడ్డికి కోర్టులో ఎదురు దెబ్బ
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్పై బుధవారం (మార్చి 11,2020) విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ ను కొట్టేసింది.
అసలేం జరిగిందంటే..
శంకర్పల్లి కానోజీగూడ దగ్గర మంత్రి కేటీఆర్ ఫాంహౌస్పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉప్పర్ పల్లి కోర్టు రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు. చర్లపల్లి జైల్లో రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం (మార్చి 2,2020) మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ దగ్గర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కేసీఆర్, కేటీఆర్ పై ఆరోపణలు:
సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫార్మ్హౌస్ను కొంత మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.
రేవంత్ తో పాటు 8మందిపై కేసు:
కేటీఆర్ ఫామ్హౌస్పై డ్రోన్ ఎగురవేసిన కేసులో నార్సింగి పోలీసులు 8 మందిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. గత విచారణలో ఆరుగురికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా బుధవారం బెయిల్ వస్తుందని భావించగా.. నిరాశే దక్కింది. తమ క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రేవంత్ పై కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు. అదే సాకుతో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారని వాపోయారు. రేవంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని వాదనలు వినిపించారు. కాగా, కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది.
See Also | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్