Mosque Blast : అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుళ్లు…15 మంది మృతి

అప్ఘానిస్థాన్‌ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.....

Mosque Blast : అఫ్ఘానిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుళ్లు…15 మంది మృతి

Updated On : October 14, 2023 / 1:35 PM IST

Mosque Blast : అప్ఘానిస్థాన్‌ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది. బగ్లాన్ ప్రావిన్స్ మధ్యలో ఉన్న పోల్-ఎ-ఖోమ్రీలోని తకియాఖానా ఇమామ్ జమాన్ వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మసీదులో ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించిందని బగ్లాన్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ముస్తఫా హషేమీ ధ్రువీకరించారు.

Also Read :Ukraine war : యుక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా 1000 కంటైనర్లలో ఆయుధాలు…రహస్యంగా రైళ్లలో తరలింపు, ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెల్లడి

పేలుడు ఫలితంగా కొంతమంది వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇటీవల కాలంలో అప్ఘానిస్థాన్‌ను వణికించిన మరో పేలుడు ఇది. ఇటీవల భూకంపం కారణంగా దేశం భారీ వినాశనానికి గురైంది. 2021వ సంవత్సరంలో తాలిబాన్ పాలన చేపట్టినప్పటి నుంచి అప్ఘాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ ఏడాది జూన్‌ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read :Benjamin Netanyahu: మూడు పెళ్లిల్లు, సైన్యంలో అన్న చనిపోయాక కసితో రాజకీయాల్లోకి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర జర్నీ తెలుసుకోండి

అఫ్ఘానిస్థాన్ దేశం తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల తిరుగుబాటుతో పోరాడుతోంది. ఈ తిరుగుబాటు బృందం పౌరులు, విదేశీయులు, తాలిబాన్ భద్రతా బలగాలను కూడా లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నాయి.

Also Read :Revanth Reddy : 50శాతం సీట్లు కొలిక్కి, త్వరలోనే జాబితా విడుదల- అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు