Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ప్రదానం.. ఈ ప్రాంతాలను సందర్శించిన భారత ప్రధాని
మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.

Narendra Modi
Narendra Modi – Egypt: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్ట్ రాజధాని కైరో(Cairo)లో పర్యటిస్తున్నారు. మోదీకి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ( Abdel Fattah al Sisi ) తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ప్రదానం చేశారు. అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ నిన్న ఈజిప్ట్ వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మోదీ ఈజిప్ట్ తో ధ్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్బౌలీతో మోదీ చర్చలు జరిపారు. కైరోలోని ఓ హోటల్ లో మోదీ బస చేశారు. అక్కడ ఆయనకు నిన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ నినాదాలు చేశారు.
తన పర్యటనలో భాగంగా మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది. దీన్ని 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అలాగే, హెలియోపొలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకాన్ని సందర్శించారు మోదీ. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ 5 రోజుల అమెరికా-ఈజిప్ట్ పర్యటన నేటితో ముగియనుంది.
You really have to feel sorry for the opposition who work hard everyday to find some issue to target Modi Ji.
Unfortunately for them, our PM’s popularity & greatness keeps soaring!
Proud moment yet again as @narendramodi ji is conferred Egypt’s highest State Honour. ?? ?? pic.twitter.com/eVdIHEGbOu
— Sumit Agarwal ?? (@sumitagarwal_IN) June 25, 2023