Pakistan: ఇండియా నుంచి పాకిస్తాన్‌కు దూసుకెళ్లిన ప్రొజెక్టైల్

పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి ఇండియాకు చెందిన ప్రొజెక్టైల్ అత్యంత వేగంతో దూసుకొచ్చిందని పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. బుధవారం మార్చి 9న పాకిస్తాన్ లోని పంజాబ్ భూభాగంలో పడిందని ఆస్తి..

Pakistan: ఇండియా నుంచి పాకిస్తాన్‌కు దూసుకెళ్లిన ప్రొజెక్టైల్

Pakistan Army

Updated On : March 11, 2022 / 10:34 AM IST

Pakistan: పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి ఇండియాకు చెందిన ప్రొజెక్టైల్ అత్యంత వేగంతో దూసుకొచ్చిందని పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. బుధవారం మార్చి 9న పాకిస్తాన్ లోని పంజాబ్ భూభాగంలో పడిందని ఆస్తి నష్టం వాటిల్లగా, ప్రాణ నష్టం మాత్రమే జరగలేదని వెల్లడించారు.

‘మార్చి 9న సాయంత్రం 6గంటల 43నిమిషాలకు వేగవంతమైన వస్తువు ఇండియా నుంచి పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి దూసుకొచ్చింది. ప్రారంభమైన ప్రదేశం నుంచి యాంగిల్ మార్చుకుని పాకిస్తాన్ భూభాగంలోకి ల్యాండ్ అయింది. దాని కారణంగా ఆస్తి నష్టం వాటిల్లగా అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు’ అని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖార్ మీడియాతో అన్నారు.

ఇండియా నుంచి వచ్చిన వస్తువును పంజాబ్ లోని ఖానెవాల్ జిల్లా, మియాన్ చన్ను ప్రాంతంలో బుధవారం రాత్రి క్రాష్ చేశామని అన్నారు. ఇంక మాట్లాడుతూ ఇండియా దీని గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని అన్నారు.

Read Also : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

40వేల అడుగుల ఎత్తులో 207కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి దూసుకొచ్చింది. ఇది సూపర్ సోనిక్ అన్ ఆర్మ్‌డ్ సర్ఫేస్ టూ సర్ఫేస్ మిస్సైల్ గా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపేందుకు కార్యచరణ సిద్ధం చేశారు.