Shahid Latif Dead: పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ కాల్చివేత
పఠాన్కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది

Terrorist Shahid Latif Shot Dead: పఠాన్కోట్ దాడి సూత్రధారి, భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్.. పాకిస్తాన్లో దారుణ హత్యకు గురయ్యాడు. 2016లో పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు మరణించారు. ఈ దాడికి షాహిద్ లతీఫ్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ తన విచారణలో తేల్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సియాల్కోట్ నగరంలో ఒక మసీదులో గుర్తు తెలియని దుండగులు అతన్ని కాల్చి చంపారు.
పఠాన్కోట్లో ఉగ్రదాడికి ప్లాన్
పఠాన్కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది. దాడి చేసేందుకు భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదుల సూత్రధారులు, హ్యాండ్లర్లు పాకిస్థాన్లోనే ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 47 ఏళ్ల షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలోని అమీనాబాద్ పట్టణంలోని మోర్ గ్రామానికి చెందిన నివాసి. షాహిద్ లతీఫ్ను జైషే లాంచింగ్ కమాండర్గా పిలుస్తారు. అతడు నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను పఠాన్కోట్కు పంపాడు.
11 ఏళ్ల పాటు భారత జైల్లో షాహిద్
షాహిద్ లతీఫ్ 1993లో ఉగ్రవాద ఆరోపణలపై భారతదేశంలో అరెస్టయ్యాడు. అనంతరం అతనిపై విచారణ జరిపి జైలుకు పంపారు. షాహిద్ లతీఫ్ దాదాపు 11 ఏళ్ల పాటు భారతీయ జైలులో బంధించబడ్డాడు. భారత్లో శిక్షాకాలం పూర్తయిన తర్వాత 2010లో పాకిస్థాన్కు పంపబడ్డాడు. భారత్ నుంచి బహిష్కరణకు గురైన షాహిద్ లతీఫ్ తిరిగి పాకిస్థాన్లోని జిహాదీ ఫ్యాక్టరీకి వెళ్లి పఠాన్కోట్ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.