Major : అడివి శేష్ ‘మేజర్’ థియేట్రికల్ రిలీజ్ పోస్ట్పోన్..
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ‘మేజర్’ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించారు.. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ‘మేజర్’ సినిమా థియేట్రికల్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు..

Adivi Sesh Major Movie Postponed
Major: వెర్సటైల్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన బాలీవుడ్కు పరిచయం అవుతున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ చిత్రంలో ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్.
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ‘మేజర్’ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ‘మేజర్’ సినిమా థియేట్రికల్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.
‘‘కోవిడ్ సేకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కోవిడ్ నియమ నిబంధలను పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉంటున్నారని మేం అనుకుంటున్నాం. అలాగే జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాం. మా ‘మేజర్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘మేజర్’ సినిమా థియేట్రికల్ రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘మేజర్’ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. దయచేసి విధిగా మాస్కులు ధరించండి. కోవిడ్ నియమనిబంధనలను, నియంత్రణ చర్యలను తప్పక పాటించండి’’ అని మూవీ టీమ్ పేర్కొంది.
ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించిన అమర వీర జవాను, ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్ సంస్థల అసోసియేషన్తో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుంది..