Second Pfizer Covid Shot : ఫైజర్ రెండో డోసు ఎంత ఆలస్యమైతే.. అంత బాగా యాంటీబాడీలు తయారవుతాయి..

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తర్వాత రెండో డోసుకు మధ్య గ్యాప్ ఎంత ఆలస్యమైతే అంతగా యాంటీబాడీలు తయారవుతాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ కొవిడ్ యాంటీబాడీలు రెండో మోతాదుకు మధ్య 12 వారాలు ఆలస్యమైతే..

Second Pfizer Covid Shot : ఫైజర్ రెండో డోసు ఎంత ఆలస్యమైతే.. అంత బాగా యాంటీబాడీలు తయారవుతాయి..

Delayed Second Pfizer Covid 19 Shot Produces More Antibodies

Updated On : May 14, 2021 / 12:12 PM IST

Delayed second Pfizer COVID-19 shot : ఫైజర్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తర్వాత రెండో డోసుకు మధ్య గ్యాప్ ఎంత ఆలస్యమైతే అంతగా యాంటీబాడీలు తయారవుతాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ కొవిడ్ యాంటీబాడీలు రెండో మోతాదుకు మధ్య 12 వారాలు ఆలస్యమైతే.. వృద్ధుల్లో మూడన్నర రెట్లు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయని బ్రిటన్ అధ్యయనంలో రుజువైంది. మూడు వారాల డోసు విరామంలో ఫైజర్ షాట్ రోగనిరోధక ప్రతిస్పందనలను క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించి నేరుగా పోల్చినట్టు ఈ అధ్యయనం పేర్కొంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఫైజర్ రెండో షాట్ ఇచ్చేందుకు 12 వారాల విరాల విరామాన్ని సూచించారు. అలాంటి వారిలో వ్యాక్సిన్ ద్వారా త్వరగా రక్షణ అందుతుందని బ్రిటన్ పరిశోధకులు భావించారు. మోతాదుల మధ్య విరామాన్ని విస్తరించడానికి ఫైజర్, టీకా భాగస్వామి బయోఎంటెక్ ఈ చర్యను బ్యాకప్ చేయడానికి డేటా లేదని పేర్కొంది.

క్లినికల్ ట్రయల్స్ ద్వారా మాత్రమే ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని ఫైజర్ తెలిపింది. రెండవ ఫైజర్ వ్యాక్సిన్ షాట్ 12 వారాలకు ఆలస్యంగా ఇవ్వడం ద్వారా వృద్ధులలో యాంటీబాడీల స్థాయి గణనీయంగా పెరుగుతాయని అధ్యయనంలో రుజువైందని బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ అధ్యయన రచయిత హెలెన్ ప్యారీ చెప్పారు. డోసుల విధానాన్ని మార్చడానికి ముందే బ్రిటన్ ఫైజర్ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ప్రారంభించింది.

80ఏళ్ల నుంచి 99ఏళ్ల మధ్య వయస్సు గల 175 మందిపై అధ్యయనాన్ని ఇంకా సమీక్షించలేదు. రెండవ మోతాదు విరామాన్ని 12 వారాలకు పొడిగించడం వల్ల గరిష్ట యాంటీబాడీలు మూడు రెట్లు ఉన్న వారితో పోలిస్తే 3.5 రెట్లు పెరిగిందని కనుగొన్నారు. యాంటీబాడీలు అనేవి రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం.. టీకాలు కూడా టి కణాలను ఉత్పత్తి చేస్తాయి. మోతాదుల మధ్య 3 వారాల విరామంతో గరిష్ట T సెల్ ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. రెండవ మోతాదు ఆలస్యంగా ఇవ్వడం ద్వారా యూకేలో మంచి ఫలితాన్నిచ్చిందని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.