బాధ్యత ఉండక్కర్లా?.. సోనమ్‌పై రష్మీ ఫైర్..

లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చా అంటూ సోనమ్ కపూర్‌పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.

  • Publish Date - April 11, 2020 / 12:30 PM IST

లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చా అంటూ సోనమ్ కపూర్‌పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.

 

టాలీవుడ్ పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనో నిత్యావసరాలకోసమో తప్ప ఎవరూ బయటకి రావడంలేదు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్లు ఇస్తున్నారు.

తాజాగా సోనమ్ ‘నేను ఓ చాకోలెట్ కేక్ చేశాను. నేను చేయాలనుకున్న టైమ్‌కి ఇంట్లో చాక్‌లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లై సంస్థ నాకు చాలా క్వాలిటీ గల చాక్‌లెట్‌ను పంపింది. చాక్లెట్ పంపించి నాకు సహకరించిన వారికి ధ‌న్య‌వాదాలు.. లవ్యూ న్యూ ఢిల్లీ’ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన రష్మీ.. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబు చెప్పిన ‘బాధ్యత ఉండక్కర్లా’ డైలాగుతో సోనమ్‌పై విరుచుకుపడింది.

‘సెలబ్రిటీ హోదా ఉంటే చాలు.. ఏదైనా చేయాలనిపిస్తుంది. అన్నీ సమకూర్చుకోగలమని కూడా అనుకుంటారు. కాకపోతే కాస్త బాధ్యతతో ఉంటే మంచిది. చాక్‌లెట్ డెలీవరీ కోసం ప్రజలను రోడ్లపైన తిప్పాలనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే నీ అవసరం కోసం దుకాణాలు తెరిపించడం వంటివి కూడా ప్రస్తుత పరిస్థితులలో కరెక్టేనా అనేది కూడా ఆలోచించాలి’ అంటూ సోనమ్‌కు సలహా ఇచ్చింది. 

Read Also : ముగ్గురు పిల్లలకు తల్లినయ్యా.. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు..
ప్రస్తుత విపత్కర పరిస్థితిలో మూగ జీవాలను గురించి పట్టించుకునే నాధుడు లేడు. దీంతో వీధి కుక్కల దుస్థితికి చలించిపోయిన రష్మీ తానే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కుక్కలకు ఆహారం, నీళ్లు అందించింది. అందరూ సమీపంలో ఉన్న మూగ జీవాలకు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు