Raj Tarun : హీరో రాజ్తరుణ్పై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడని పేర్కొంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. రాజ్తరుణ్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, తన నంబర్ను బ్లాక్ లో పెట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు 4 పేజీలతో ఫిర్యాదు లెటర్ రాసింది.
”రాజ్తరుణ్తో 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాను. మేమిద్దం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్తో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ తరువాత నన్ను వదిలివేశాడు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాతో కాంటాక్ట్లో కూడా లేడు. రాజ్ని వదలకపోతే చంపేసి బాడీ మాయం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.
Also Read : నిప్పుతో ఆడుకుంటున్న కళ్యాణ్ రామ్.. ఫ్యాన్స్కు పండగే..
రాజ్ తరుణ్ నా ప్రపంచం.. రాజ్ నాకు కావాలి. నాకు న్యాయం చేయండ”ని లావణ్య డిమాండ్ చేసింది. అలాగే గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని మండిపడింది. తాను అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని చెప్పింది. ఆ సమయంలో రాజ్ తనకెలాంటి సాయం చేయలేదంది. లావణ్య ఫిర్యాదుపై రాజ్తరుణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
నార్సింగ్ సీఐ హరికిషన్ ఏమన్నారంటే..
నిన్న సాయంత్రం లావణ్య అనే యువతి నార్సింగ్ పియస్కు వచ్చి హీరో రాజ్ తరుణ్పై ఫిర్యాదు ఇచ్చింది. రాజ్ తరుణ్ తాను రిలేషన్షిప్లో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొంది. తనతో కాకుండా మరొక యువతితో అతడు రిలేషన్షిప్లో ఉన్నాడని, 3 నెలల క్రితం తనను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పింది. ఆమె ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ప్రకారం ఎంక్వైరీ చేస్తాము. లావణ్యపై గతంలో డ్రగ్స్ కేసు ఉంది, జైలుకెళ్లొచ్చింది.