మెగాప్రిన్స్ ముఖ్య అతిథిగా ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్..
ఈ నెల 29 న వైజాగ్లో 'భీష్మ' థ్యాంక్స్ మీట్.. ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్..

ఈ నెల 29 న వైజాగ్లో ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్.. ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్..
యంగ్ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ చిత్రం మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. కథానాయకుడు నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలచింది ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు.
ప్రపంచ వ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్. ఈ నెల 29 న వైజాగ్లోని ‘గురజాడ కళాకేత్రం’లో ‘భీష్మ’ చిత్ర విజయోత్సవ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ వేడుకకు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీలో నితిన్ అతిథి పాత్రలో కనిపించగా.. ఇప్పుడు నితిన్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమానికి వరుణ్ ముఖ్య అతిథిగా రానుండడం విశేషం.
హీరో నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలచిన ‘భీష్మ’ వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురంలోని ‘గురజాడ కళాకేత్రం’లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్నలతోపాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు.