మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్లో డియర్ కామ్రేడ్ టీమ్
మహర్షి సినిమా ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్తో, అన్నిచోట్లా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా మహర్షి టీమ్, తమ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంది..

మహర్షి సినిమా ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్తో, అన్నిచోట్లా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా మహర్షి టీమ్, తమ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్తో, అన్నిచోట్లా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుందీ సినిమా… ఈ సందర్భంగా మహర్షి టీమ్, తమ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంది.
Also Read : OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి
మహేష్, పూజా హెగ్డే, దేవి శ్రీ ప్రసాద్, శ్రీమణి, శిరీష్, లక్ష్మణ్, అనిల్ రావిపూడి, అనిల్ సుంకర, పివిపి, దిల్ రాజు, అశ్వినీదత్, వంశీ పైడిపల్లితో పాటు, డియర్ కామ్రేడ్ టీమ్ కూడా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపెట్ చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన మోహన్ తదితరులు మహర్షి నిర్మాతలు ఇచ్చిన సక్సెస్ పార్టీలో సందడి చేసారు. మహర్షి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్ళు రాబడుతుందని తెలుస్తుంది.