పిల్లలని ప్రేమించడం తప్పా?.. ఉత్కంఠగా ఆర్జీవీ ‘మర్డర్’ ట్రైలర్..
కొద్ది రోజులుగా ‘పవర్స్టార్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా
‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రమ్).. అనే సినిమా చేస్తున్నాడు.
మంగళవారం ట్రైలర్ విడుదల చేశారు. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. అది సహించలేని అమ్మాయి తండ్రి అబ్బాయిని హత్య చేయించడం తర్వాత అమ్మాయి తండ్రి తీవ్రంగా మనోవేదన పడటం అనే సన్నివేశాలను ఈ ట్రైలర్లో చూపించాడు వర్మ.
ఈ కేసుకు సంబంధించి అన్నీ విషయాలు తెలుగు ప్రజలకు తెలిసిందే. అయితే ఇందులో వర్మ కొత్తగా ఏం చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై కూడా ఎప్పటిలా వివాదాలు నెలకొన్నాయి.
ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా వల్ల కోర్టులో నడుస్తున్న కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి, అమృత మామయ్య బాలాస్వామి కోర్టులో కేసు వేశారు. మరి ఈ సినిమా విడుదలకు ముందు ఎన్ని వివాదాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ‘మర్డర్’ విడుదల కానుంది.