Prabhas-Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది: నిత్యా మీనన్

అలా మొదలైంది సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చబ్బీ కేరళ కుట్టి నిత్యామీనన్ కొద్దిసినిమాలే చేసినా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే నటిగా మంచి మార్కులు కొట్టేస్తుంది.

Prabhas-Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది: నిత్యా మీనన్

Prabhas Nithya Menen

Prabhas-Nithya Menen: అలా మొదలైంది సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చబ్బీ కేరళ కుట్టి నిత్యామీనన్ కొద్దిసినిమాలే చేసినా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే నటిగా మంచి మార్కులు కొట్టేస్తుంది. హీరోయిన్ గానే నటించాలనేది లేకుండా పాత్ర నచ్చితే అతిధి పాత్ర నుండి ఏదైనా చేసేందుకు ఒకే చెప్పే ఈ అమ్మడు ఈ మధ్యనే స్కైలాబ్ సినిమాతో నిర్మాతగా కూడా మారింది. కాగా.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిత్యా ప్రస్తుతం స్కైలాబ్ ప్రమోషన్ లో బిజీగా ఉంది.

Anaika Soti: అందాలతో చిత్రవధ చేస్తున్న అనైకా!

ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ భామ గతంలో సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన ఓ చేదు గురించి చెప్తూ బాధపడింది. గతంలో ఓ సినిమా కార్యక్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రభాస్ గురించి నిత్యామీనన్ ను అడగగా నాకు తన గురించి పెద్దగా తెలియదని చెప్పింది. దీంతో అప్పట్లో నిత్యా మీద భారీ విమర్శలు రాగా సోషల్ మీడియాలో నిత్యాను ఘోరంగా ట్రోల్స్ చేశారు. దీని గురించి మరోసారి గుర్తు చేసిన నిత్యా మీనన్ ఆ విషయం ఇప్పటికీ నాకు చాలా బాధేస్తుందని చెప్పుకొచ్చింది.

SSMB29: మహేష్‌తో సినిమా గురించి జక్కన్న కామెంట్స్!

ప్రభాస్ ఇష్యూ గురించి మరోసారి చెప్పిన నిత్యా.. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు కూడా సరిగా వచ్చేది కాదని.. అందుకే టాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్నికాదు. అలా అప్పటికి నేను ప్రభాస్ సినిమాలేవీ చూడలేదు. అప్పుడు నన్ను ఆయన గురించి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాను. అయితే, నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్న మీడియా.. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేసి ఆ విషయాన్ని పెద్దది చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్‌ అయ్యాను. ఆ వివాదంతో అన్ని చోట్ల నిజాయితీగా ఉండకూడదని.. ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైందని చెప్పుకొచ్చింది నిత్యా.