Sai Pallavi: సాయి పల్లవి డెడికేషన్.. ఏం చేసిందో తెలుసా?
మలయాళ భామ సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘‘హైబ్రిడ్ పిల్ల... ఒక్కటే పీస్’’ అనే డైలాగును తనకోసమే రాసినట్లుగా....

Sai Pallavi Dedication Stuns Virata Parvam Team
Sai Pallavi: మలయాళ భామ సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘‘హైబ్రిడ్ పిల్ల… ఒక్కటే పీస్’’ అనే డైలాగును తనకోసమే రాసినట్లుగా మార్చేసుకుంది ఈ బ్యూటీ. తన నటన, డ్యాన్స్లతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం సాయి పల్లవి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన విరాటపర్వం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..
గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 17న విరాటపర్వం సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమా కోసం సాయి పల్లవి చూపిన డెడికేషన్ గురించి చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తాజాగా చెప్పుకొచ్చాడు.
Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్
విరాటపర్వం సినిమాలో తన పాత్ర కోసం సాయి పల్లవి చాలా కష్టపడిందని ఆయన అన్నారు. ఒక సన్నివేశంలో తన పాత్రలోని ఇంటెన్సిటీని చూపించేందుకు ఆ రోజు మొత్తం సాయి పల్లవి ఏం తినకుండానే ఉందని.. అలా చేసి తన క్యారెక్టర్లో లీనమై చేసిన పర్ఫార్మెన్స్ చిత్ర యూనిట్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల కాలంలో సినిమాలోని తమ పాత్ర కోసం ఇంతలా డెడికేషన్ చూపించిన వారు లేరని.. సాయి పల్లవిలో మాత్రమే తాను ఇలాంటి డెడికేషన్ చూశానని చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక విరాటపర్వం సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.