Sai Pallavi: బుర్ఖా ధరించి ప్రేక్షకుల మధ్య సినిమా చూసిన హీరోయిన్!
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి జంటగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా పాజిటివ్ రివ్యూస్తో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకిృత్యాన్..
Sai Pallavi: నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా పాజిటివ్ రివ్యూస్తో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకిృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాలో సౌత్ అన్ని బాషలలో విడుదలై నానీ కెరీర్ లోనే భారీ సక్సెస్ సినిమాగా మారింది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ను ఈ సినిమాకు హైలైట్గా నిలిచాయి. అయితే సినిమా హిట్ టాక్ అందుకుంటున్న సందర్భంగా సాయి పల్లవి తన ఫ్యాన్స్కు సర్పైజ్ ఇచ్చింది.
RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?
బుధవారం హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో సందడి చేసింది హీరోయిన్ సాయి పల్లవి. బ్లాక్ బురఖా ధరించి ప్రేక్షకుల మధ్య ఓ సాధారణ ప్రేక్షకురాలిగా కూర్చుని సినిమా చూసింది. దర్శకుడు రాహుల్ కూడా పక్కనే ఉన్నారు. సినిమా పూర్తయిన తరువాత ప్రేక్షకులతో పాటు సాయి పల్లవి బుర్ఖాలో బయటికి వచ్చి.. కారు దగ్గరికి వచ్చిన తర్వాతే తెలిసింది తాను అదే సినిమాలో నటించిన హీరోయిన్ సాయి పల్లవినే అని. సాయిపల్లవి ఆ తరువాత బుర్ఖా తీసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Salman Khan: ఆటో నడిపిన సల్మాన్.. ఇన్సూరెన్స్ చేశారా అని ట్రోలింగ్!
థియేటర్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుర్కా తీసి తన ఫ్యాన్స్కు బై చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది సాయి పల్లవి. ఈ వీడియోను శ్యామ్ సింగరాయ్ టీమ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మడోన్నా సెబాస్టియన్ కూడా ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.