సలార్ ముహుర్తం ఫిక్స్
Salaar with pooja : రెబల్స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ మూవీకి ముహుర్తం ఫిక్స్ చేశారు. జనవరి 15వ తేదీ శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నీల్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయిన విషయం బయటపడడంతో ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటిన్యూగా నాలుగు నెలల పాటు షూటింగ్ కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటికే వర్కవుట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ రోల్ లో ప్రభాస్ కనిపించనున్నాడని పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. డిసెంబర్ 2న టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ మెషిన్ గన్ పట్టుకుని కూర్చుని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ‘The most violent men… Called him… The most violent’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. అమాయకంగా ఉండే వ్యక్తి, కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడనేది ‘సలార్’ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
ప్రస్తుతం ప్రభాస్..జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యాం’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ తరహాలో ఈ ఫిల్మ్ రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ నిర్మిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే..ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. రాముడిగా కనిపించనున్నారు ప్రభాస్. ఆ తర్వాత..వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను కూడా పట్టాలెక్కిస్తారని సమాచారం.
Cinematic powerhouses #Prabhas, @hombalefilms, @prashanth_neel, and @VKiragandur to kick-start #Salaar with pooja on January 15th at Hyderabad. ??#SalaarLaunch pic.twitter.com/8JpodB1gS5
— Prabhas (@PrabhasRaju) January 14, 2021