Raj Tarun : రాజ్‌త‌రుణ్‌ను నిల‌దీస్తానంటున్న లావ‌ణ్య‌..! ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ గ‌త కొన్నాళ్లుగా ఓ వివాదంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Raj Tarun : రాజ్‌త‌రుణ్‌ను నిల‌దీస్తానంటున్న లావ‌ణ్య‌..! ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు..!

Thiragabadara Saami press meet at prasad lab police reached

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ గ‌త కొన్నాళ్లుగా ఓ వివాదంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. లావ‌ణ్య అనే యువ‌తి రాజ్‌త‌రుణ్ పై కేసు పెట్టింది. రాజ్‌త‌రుణ్‌తో ప‌దేళ్ల‌కు పైగా క‌లిసి జీవించాన‌ని, రాజ్ న‌న్ను పెళ్లి చేసుకుని అబార్ష‌న్ చేయించాడ‌ని, హీరోయిన్ మాల్కి మ‌ల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడ‌ని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్ప‌టికే రాజ్‌త‌రుణ్‌కు నోటీసులు పంపారు.

ఈ విష‌యం పై రాజ్‌త‌రుణ్ ఓ సారి స్పందించాడు. ఆమెతో త‌న‌కు బ్రేక‌ప్ అయింద‌ని, ఆమె చెప్పేవ‌న్ని నిజం కాద‌న్నాడు. ఆ త‌రువాత ఫోన్ నంబర్ మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మ‌రోవైపు మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టింది.

Devara – Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ కోసం ఎంత ఫుడ్ తెప్పించారో చూడండి.. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా?

కాగా.. రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 న విడుద‌ల కాబోతుంది. ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రి కూడా వస్తారని సమాచారం వచ్చింది. లావ‌ణ్య విష‌యంపై రాజ్‌త‌రుణ్ స్పందిస్తాడా..? లేక సినిమా గురించి మాత్ర‌మే మాట్లాడ‌తాడా అని ఎదురుచూస్తుండ‌గా ప్ర‌సాద్ ల్యాబ్‌కు పోలీసులు చేరుకున్నారు.

రాజ్‌త‌రుణ్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలిసి.. అత‌డిని నిల‌దీసేందుకు లావ‌ణ్య అక్క‌డ‌కు వ‌స్తుంద‌న్న స‌మాచారంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.