Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు.. యానిమల్ బుకింగ్స్ ఓపెన్.. గాయంపై స్పందించిన సూర్య.. శివాజీ రీ రిలీజ్..

కంగువా షూటింగ్‌లో గాయపడిన సూర్య తాజాగా స్పందించారు. ఇపుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం కాబోతున్నారు.

Entertainment News : నేటి ఎంటర్టైన్మెంట్ విశేషాలు.. యానిమల్ బుకింగ్స్ ఓపెన్.. గాయంపై స్పందించిన సూర్య.. శివాజీ రీ రిలీజ్..

Today Latest Entertainment News Suriya Vijay Sethupathi Rajinikanth

Entertainment News : దక్షిణాదితో పాటు.. హిందీ సినిమాల్లోనూ మంచి క్రేజ్ ఉన్న నటుడు విజయ సేతుపతి. విలన్‌గా, హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇపుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం కాబోతున్నారు. సూర్య ఇప్పటికే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు ఫీనిక్స్ సినిమాలో సూర్య సేతుపతి లీడ్‌ రోల్ పోషించనున్నారు. అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

పారిజాత పర్వం సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. నటుడు సునీల్‌ను కిడ్నాప్‌ చేస్తానని నవ్వులు పూయించారు. చైతన్య రావు హీరోగా సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం పారిజాతపర్వం. శ్రద్ధాదాస్, సునీల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

తాను దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెద్ద అభిమాని అని హీరో చైతన్య రావు తెలిపారు. పారిజాత పర్వం సినిమా టీజర్ విడుదల సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో చైతన్య రావు హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది కశ్మీర్‌ ఫైల్స్‌తో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి. ఆయన తెరకెక్కించిన మరో ఆసక్తికర చిత్రం ది వ్యాక్సిన్‌ వార్‌. అనుపమ్‌ ఖేర్‌, నానా పటేకర్‌, పల్లవి జోషి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

టాలీవుడ్ యాక్టర్‌ నితిన్‌ తాజా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ . వక్కంతం వంశీ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన డేంజర్ పిల్లా, బ్రష్‌ వేసుకో పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నితిన్ టీం.

యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హనుమాన్‌. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్‌. హనుమాన్ సౌండ్‌ మిక్సింగ్‌ పనులు మొదలయ్యాయి. డాల్బీ ఆట్మోస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే మ్యూజిక్‌ను రెడీ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్‌. విడుదలై నెలరోజులు గడవకముందే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 1 లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : Vijay Sethupathi : హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు.. డైరెక్టర్ ఎవరంటే?

బాలీవుడ్ నటి అలియాభట్ మెరూన్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయారు. తాజాగా అలియాభట్ ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో మెరూన్ కలర్ డీప్ కట్ డ్రెస్ ధరించి హోయలొలికించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి.

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌. తాజాగా ఆమె ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో స్టైలిష్ లూక్‌లో మెరిశారు. ఈ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్ వేదికగా రకుల్ పంచుకున్నారు.

కంగువా షూటింగ్‌లో గాయపడిన సూర్య తాజాగా స్పందించారు. చిత్రీకరణ సమయంలో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. గాయం నుంచి తాను కోలుకుంటున్నట్లు సూర్య ఎక్స్ వేదికగా చెప్పారు. తన గాయం గురించి ఎంతో మంది మెసేజ్‌లు పంపుతున్నారని.. మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సూర్య అన్నారు. ఇప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు.

ఇకపై విలన్‌గా నటించబోనంటున్నారు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచే విజయ్‌ సేతుపతి.. గోవాలో జరుగుతున్న ‘ఇఫి’ వేడుకల్లో మాట్లాడారు. ఇటీవల జవాన్‌లో విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ ప్రెజర్‌ కారణంగానే విలన్‌ పాత్రల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘టైగర్‌3’లో యాక్షన్‌ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి కత్రినా కైఫ్‌. నటిగా తన సినీ ప్రయాణం మొదలు పెట్టి ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. తానెంతో అదృష్టవంతురాలినని కత్రీనా పేర్కొన్నారు. తన కెరీర్‌ విషయంలో తాను ఎంతో గర్వ పడుతున్నానని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇటీవల జవాన్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న షారుక్‌.. ఈ ఏడాది పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు. IMDb విడుదల చేసిన ఈ లిస్టులో షారుక్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాథల్-ది కోర్‌’. సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్న ఈ చిత్ర ప్రచారంలో ప్రేమ, పెళ్లి గురించి జ్యోతిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో పడటం చాలా సులువని, కానీ ప్రేమలో ఎదగడాన్ని మాత్రం మార్చిపోకూడదని హితవు పలికారు. మన భాగస్వామిని గౌరవించడం, అభినందించడం దాంపత్యంలో చాలా ముఖ్యమని సలహా ఇచ్చారు జ్యోతిక.

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది.. అదే బాటలో శివాజీ మూవీ కూడా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీని డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ మూవీని డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల మూడు రోజులు వాయిదా పడింది.

యానిమల్ మూవీ టికెట్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో యానిమల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్‌లో యానిమల్ ప్రీమియర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ధ్రువ నక్షత్రం సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఇవాళ వరల్డ్ వైడ్‍గా థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను పోస్టుపోన్ చేస్తున్నట్లు డైరెక్టర్ గౌతమ్ మీనన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ధృవ నక్షత్రం సినిమాను థియేటర్లలోకి తీసుకురాలేకపోయామని, సాధ్యమైనంత వరకు ప్రయత్నించామని, రెండు రోజుల సమయం కావాలని గౌతమ్‌ పేర్కొన్నారు.

నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్‌ దూత. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దూత ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ ట్రైలర్‌ 3.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి.. దూసుకెళ్తోంది. ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉందని చైతన్య అభిమానులు అంటున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్ చేస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ డంకీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి లుట్ పుట్ గయా అనే ఫస్ట్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియోట్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే.. 30 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది అవికాగోర్‌. అనంతరం పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించింది. తాజాగా వధువు అనే ఓటీటీ వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తోంది అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ కానుంది. ఈ నేపథ్యంలో వధువు ట్రైలర్‌ను విడుదల చేశారు.