Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ భక్తిని చాటుకున్నారు.

Tollywood Celebrities tweets on Ayodhya Ram Mandir Opening Ceremony

Ayodhya Ram Mandir : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా దాదాపు 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భం.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం. ఏళ్లనాటి కల నేడు నెరవేరింది. దీంతో ప్రతిఒక్కరు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రామ రామ అంటూ తమ ఆనందాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పై ట్వీట్ చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.

Also read : Jai HanuMan : ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్.. హనుమంతుడిగా చిరంజీవి..? రానా దగ్గుబాటి..?

చరిత్ర యొక్క ప్రతిధ్వనులు మరియు నమ్మకం యొక్క పవిత్రత మధ్య అయోధ్యలో రామమందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత మరియు ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది.. అంటూ మహేష్ పేర్కొన్నారు.

శ్రీరాముడి మన భారత నాగరికత యొక్క వీరుడు. ఆయనని అయోధ్యకి తిరిగి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది. రామ ప్రాణ ప్రతిష్టతో నేడు ఆ కల సాకారం కాబోతుంది.. అంటూ పవన్ పేర్కొన్నారు.

లోకః సమస్తః సుకిన్హో భవన్. ఈ శుభ సందర్భంగా ప్రేమ, కరుణ, శాంతి మరియు శ్రేయస్సు యొక్క సుదీర్ఘ శాశ్వత యుగం ప్రారంభం కావాలి మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదంగా మారుతుంది.. అంటూ మాధవన్ పేర్కొన్నారు.