ఈ పండు తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి
కరోనా వైరస్ క్రమంలో…ఇమ్యునిటీ పవర్ పెంచుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులను పాటిస్తున్నారు. కషాయం నిత్య జీవితంలో భాగం చేసేసుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర వాటిని తీసుకుంటున్నారు.
పండ్లలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో హనీడ్యూ మెలన్ ఒకటి. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుందంటున్నారు.
- ఇది పచ్చ రంగులో ఉంటుంది. ఇందులో 64 కెలరీలు ఉంటాయ. 1.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వెయిట్ వాచర్స్ ఫ్రెండ్లీ ఫుడ్ అని అంటారు.
- వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోడియం అధికంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆకలి తీరిన ఫీలింగ్ కలుగుతుంది.
- విటమిన్ సి ఉంటుంది. జలుబును దూరం చేస్తుంది. న్యూమోనియో వంటి రెస్పిరేటరీ రిస్క్స్ తగ్గుముఖం పట్టేలా చూస్తుంది.
- హనీడ్యూ మెలన్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఉంటుంది. శరీరంలో ఫ్లూయిడ్స్ బాలన్స్ మెయింటేయిన్ చేయడానికి గ్రీన్ మెలన్ సాయ పడుతుంది. కేలరీలు తక్కువగా ఉండి..పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
- ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో హనీడ్యూ మెలన్ పండుని జ్యూస్ చేసుకున తాగితే శరీరాన్ని చల్ల చేస్తుంది.
- ఎముకలు బలంగా తయారవుతాయి. క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి.