కోడి పెట్టిన చిచ్చు : 34మందిపై కేసు.

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 07:51 AM IST
కోడి పెట్టిన చిచ్చు : 34మందిపై కేసు.

Updated On : March 24, 2019 / 7:51 AM IST

రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగేనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 

యరగేరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తాలూక లోని బీజనగేరా గ్రామంలో తిమ్మప్ప, నరసప్పబలప్ప కుటుంబీకులు రక్త సంబంధీకులు. వీరి కుటుంబాల మధ్య ఏనాటి నుంచో పొలం విషయంలో పాత కక్షలుగా ఉన్నాయి. ఈ క్రమంలో వారి ఇళ్ల మధ్య ఒకరు పెంటకుప్పను మరొకరికి సంబంధించి కోడి కెలికింది(దువ్వింది). ఇంకేముందు అగ్గి రాజుకుంది. మాటల తూటాలు పేలాయి. ఘర్షణ పడ్డారు. కొట్టుకున్నారు. అంతటితో ఊరుకోలేదు..ఏకంగా మారణాయుధాలతో దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న యరగేరా పోలీసులు రెండు కుటుంబాల వారికి సర్ధి చెప్పి..పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కానీ వారి మధ్య మాత్రం పూర్తిస్థాయి సమోధ్య కుదరలేదు..గొడవలు జరుగుతుండటంతో యరగేరా పోలీస్‌స్టేషన్‌లో 34మందిపై కేసు నమోదు చేశారు. ఘర్షణలో తీవ్రంగా గాయాలు పాలైన 9మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.