Corona Effect: గంగలో గుట్టలుగా.. నదిలో 48శవాలు

Corona Effect
బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో గంగా నదిలో కిలోమీటర్ పరిధిలో 48 మృతదేహాలు తేలియాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కరోనాతో చనిపోయిన మృత దేహాలను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా దయనీయ పరిస్థితులు కనిపిస్తుండగా.. ఈ సమయంలో శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.
అంతకుముందు యమునా నదిలో కూడా గుట్టలుగా తేలియాడుతూ కనిపించగా.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటన ఆదివారం(మే 9,2021) ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్లో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
యమునా నదిలో డజన్లకు పైగా కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించగా.. ఉత్తరప్రదేశ్లోని హామిర్పుర్ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. హామిర్పర్, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోగా.. స్మశానాల్లో చోటులేక నదుల్లో వేస్తున్నారు మృతదేహాలు.