కరోనా ఎఫెక్ట్ : సెలవుపై వెళ్లిన గవర్నర్..ప్రభుత్వం అసహనం
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. విశ్వవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7వేలు దాటింది. భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
గవర్నర్ తనవెంట వ్యక్తిగత, పోలీసు, వైద్య సిబ్బందిని తీసుకెళ్లడంపై కేరళ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్కు సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశ్యంతో నేదుమన్గడ్ డీఎస్పీ ముఖ్యమైన కరోనా సమావేశానికి గైర్హాజరయ్యాడని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్పుడైనా సెలవులు తీసుకునే హక్కు గవర్నర్కు ఉంటుందని, కానీ ఇది సరియైన సమయం కాదని ఎమ్మెల్యే వీ.కె ప్రశాంత్ అన్నారు.
ఆరోపణలపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందిస్తూ.. తాను గిరిజన ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అటవీ అధికారి కెఐ.ప్రదీప్ కుమార్, రేంజ్ ఆఫీసర్ పలోడ్లతో చర్చించడానికి వెళ్లానని ట్విటర్లో వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. కాగా కేరళలో ఇప్పటి వరకు 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also Read | ఓయూ హాస్టళ్లు మూసివేత, వెళ్లిపోవాలని విద్యార్థులకు ఆదేశాలు