Nita Ambani: శ్రీలంకకు అంబానీ భార్య.. కప్పులు, శాసర్లు షాపింగ్ కోసం ప్రైవేట్ జెట్లో ప్రయాణం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.. బకింగ్హామ్ ప్యాలెస్. దాని తర్వాతి కాస్ట్రీ బిల్డింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీనే. 40అంతస్తుల్లో 170కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. ఆ (యాంటిల్లా) అని పిలిచే ఇంట్లో పెట్టుకోవడానికి రీసెంట్గా శ్రీలంకకు వెళ్లివచ్చారట.

Nita Ambani
Nita Ambani: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.. బకింగ్హామ్ ప్యాలెస్. దాని తర్వాతి కాస్ట్రీ బిల్డింగ్ అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీనే. 40అంతస్తుల్లో 170కార్లతో ఉండే విలాసవంతమైన భవనం అది. ఆ (యాంటిల్లా) అని పిలిచే ఇంట్లో పెట్టుకోవడానికి రీసెంట్గా శ్రీలంకకు వెళ్లివచ్చారట. అక్కడ కాస్త ఖరీదు తక్కువగా వస్తాయిన బయల్దేరి వెళ్లిన ఆమె ప్రైవేట్ జెట్ లో ప్రయాణించి మరీ తీసుకొచ్చారు.
ఇంకొక అద్భుతమైన విషయమేమిటంటే ఆ ఇంట్లో వంట సామాను కోసమే కాకుండా దీపావళి కానుకలు ఇచ్చేందుకు కూడా షాపింగ్ చేశారట నీతా అంబానీ. జపనీస్ బ్రాండ్ అయాని Noritakeకు చెందిన వస్తువుల కోసం అక్కడకు వెళ్లారు. Noritakeపేరుతో ఉండే గ్రామంలో తయారుచేసిన వస్తువులు దశాబ్దాల క్రితమే అమెరికాకు చేరుకున్నాయి.
హోటల్ గ్రూపుల్లో, ఎయిర్ లైన్స్ లో, ప్రైవేట్ హోమ్స్ లో ఈ బ్రాండ్ చాలా సార్లు కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఫ్యామస్ అయినటువంటి బ్రాండ్ కోసం.. బడా బాబులు వేల డాలర్లు ఈజీగా ఖర్చుపెట్టేస్తుంటారట. ఇవి ఇండియాలో దొరికే వస్తువులే అయినా వీటి కోసం నీతా అంబానీ శ్రీలంకకు ఎగిరి 1500కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మొత్తం 25వేల వస్తువులు పట్టుకొచ్చారు.
ధర తక్కువని విమానంలో వెళ్లారు:
అంత దూరం ప్రయాణించడానికి కారణం శ్రీలంకలో ధర తక్కువగా వస్తుందనట. 22 క్యారెట్ గోల్డ్ తో ఉండే వీటి ధర ఇండియాలో 800డాలర్ల నుంచి 2వేల డాలర్లు ఉంటుంది. అదే శ్రీలంకలో అయితే 300డాలర్ల నుంచి 500డాలర్లకే వచ్చేస్తాయి. విమాన ఇందనానికి అయ్యే ఖర్చుతో లెక్కేసి చూసినా కూడా ఆమె ప్రయాణం చేసిన షాపింగ్ కు అక్కడికి వెళ్లడం కారణంగానే తక్కువ ధరకు వచ్చాయని చెప్తున్నారు.