DRDO :కోవిడ్ కు విరుగుడు, డీఆర్డీవో 2డీజీ కరోనా మందు
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరో ముందు ప్రజల ముందుకు వస్తోంది. ఆర్డీవో అభివృద్ధి చేసిన..కోవిడ్ 19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) అందుబాటులోకి రానుంది.
Delhi Hospitals : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మరో ముందు ప్రజల ముందుకు వస్తోంది. ఆర్డీవో అభివృద్ధి చేసిన..కోవిడ్ 19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) అందుబాటులోకి రానుంది. 2021, మే 17వ తేదీ సోమవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఈ డోసులను పంపిణీ చేయనున్నారు.
మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది.
దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది.
Read More : Salman Khan’s Radhe : సిటీ మార్ సాంగ్ కు వైద్యుల డ్యాన్స్