Misnish sisodiya : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవావ్ ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.