చెన్నైలో రూ.కోటి 50లక్షల విలువైన బంగారం స్వాధీనం
చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో బంగారం పట్టుబడింది. దీని విలువ కోటి 15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు యువకులు ఏప్రిల్ 12వ తేదీ గురువారం రాత్రి దుబాయ్ నుండి చెన్నైకి వచ్చారు. వీరిని ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీలు చేయగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also : గిన్నీస్ బుక్ లో నిజామాబాద్ రికార్డ్
కొలంబో నుండి చెన్నైకి వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా 1.26 కిలోల బంగారం బయటపడింది. నైరోబీ నుండి వచ్చిన ఇద్దరు యువకులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా లో దుస్తుల్లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 3.50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
Read Also : ఇదో సంచలనం : చరిత్ర తిరగరాసిన రైల్వే, బస్ జర్నీ