Navy Chopper
Navy Chopper Accident: ముంబయి సముద్ర తీరానికి సమీపంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ముంబయి సముద్ర తీరంలో కుప్పకూలింది. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికిగల కారణాలను తెలుసుకొనేందుకు భారత నావికాదళం ఘటనపై విచారణకు ఆదేశించింది.
భారత నావికాదళం ఏఎల్హెచ్ ముంబయి నుండి తీరానికి దగ్గరగా ఉందని, తక్షణ శోధన, రెస్క్యూ నౌకాదళ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించడం జరిగిందని భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉంటే.. గత ఏడాది అక్టోబర్లో ఆర్మీకి చెందిన అడ్వాన్స్ డ్ తేలికపాటి హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది మరణించిన విషయం విధితమే.
Indian Navy ALH on a routine sortie off Mumbai ditched close to the coast.
Immediate Search and Rescue ensured safe recovery of crew of three by naval patrol craft.
An inquiry to investigate the incident has been ordered.— SpokespersonNavy (@indiannavy) March 8, 2023