IRCTCలో భారీగా పెరిగిన ఆహార ధరలు, టీ@35

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం (నవంబర్ 14, 2019) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని, శాతాబ్ది, దురంటో ఎక్స్ప్రెస్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను భారీగా పెంచింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానాన్ని 15 రోజుల తరువాత వెల్లడించనున్నట్లు తెలిపారు.
సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుంచి 120 రోజుల తరువాత పెరిగిన ధరలు వర్తిస్తాయని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) విడుదల చేసిన సర్క్యులర్ తెలిపింది.
కొత్త ఛార్జీల ప్రకారం.. రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ప్రెస్లలో కప్పు టీ ధర రూ.10 నుంచి రూ.15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ.20, ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్లో ఫుడ్ కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. ఇంతకముందు రూ.80 ఉండేది.
ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు). ఫుడ్ రూ. 140 (రూ .7 పెంపు) లంచ్, డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది).